యంత్రానికి ప్రాణం పోయాలని అక్షరాల దేహాలను కోస్తున్న కాలమిది.

Author: Namburi ChandraSekhar Original Post: Facebook


The thread is an emotional debate about AI training, book digitization, and the cultural value of physical books. The original post argues that AI companies may buy and destructively scan old books at industrial scale, turning them into training data and discarding the physical copies—a practice the author sees as a loss of human memory, heritage, and access to rare knowledge. facebook

Main argument

The post says books are more than text: annotations, paper, bindings, cover art, ownership history, and their physical presence carry cultural and emotional value that a digital file cannot preserve. It warns especially about rare or sole surviving copies being absorbed into private datasets, potentially making knowledge inaccessible to scholars and the public. facebook

It calls for non-destructive scanning, collaboration with libraries and publishers, and preservation of originals after digitization. Readers are urged not to casually sell old books to unknown buyers and instead protect or donate them responsibly. facebook

Comments and debate

Bottom line

The thread does not reject digitization or AI outright. Its central demand is that access to knowledge should expand without destroying the original physical books, their cultural context, or public ownership of rare material. facebook

యంత్రానికి ప్రాణం పోయాలని అక్షరాల దేహాలను కోస్తున్న కాలమిది.. 💔 పుస్తకాలను చదవడానికి కాదు… ఏఐకి తినిపించడానికి చంపుతున్నారు. జ్ఞానం బతికినా, ఆ పుస్తకం ఆత్మ కన్నీరై రాలుతున్న తీరని విషాదమిది! పాత పుస్తకాల కబేళా... మన ప్రాణసమానమైన పుస్తకాలను నమిలి మింగుతున్న కృత్రిమ రాక్షసి 🦖 ఈ రహస్యం తెలిస్తే ప్రతి పుస్తక ప్రేమికుడి గుండె పగిలిపోతుంది పుస్తకం... నా ప్రాణం. నా చేతిలో ఇమిడిపోయే ఒక కాలపు నిదర్శనం. కాగితపు పేజీలను తిరగేస్తుంటే, నా వేళ్ల మధ్య ఒక రచయిత గుండెచప్పుడు వినిపిస్తుంది. అందులో కనిపించే ప్రతి పంక్తి ఒక జ్ఞాపకమే. ఎవరో మడిచిన పేజీ మూల, ఎవరో గీసిన పెన్సిల్ గీత, పాత కాగితం వాసన, ఇవన్నీ మనిషి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ఇప్పుడు ఆ సాక్ష్యాలను నిర్దాక్షిణ్యంగా చెరిపేస్తున్నారు. మన ప్రాణసమానమైన అక్షరాల దేహాలను అత్యంత కిరాతకంగా ముక్కలు చేస్తున్నారు. ఒక కొత్త తరహా కృత్రిమ మేధస్సుకు ప్రాణం పోయడానికి, పాత తరాల జ్ఞానాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నారు. పుస్తకం అంటే అక్షరాల సమూహం కాదు, అది మనిషి ఆత్మ. ఆ ఆత్మను చంపి, డేటా అనే మాంసాన్ని పీక్కుతింటున్న ఒక డేటా ఆకలి కి మన వారసత్వాన్ని గుడ్డిగా బలిస్తున్నారు. 2026 ఆగస్టు 17. ఈ రోజు చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది. 404 మీడియా జర్నలిస్ట్ ఇమ్మాన్యుయేల్ మైబెర్గ్ బయటపెట్టిన నిజాలు వింటే, ఏ పుస్తక ప్రేమికుడి గుండె అయినా ముక్కలవ్వాల్సిందే. ఒక అరుదైన పుస్తకాల వ్యాపారికి ఆన్‌లైన్‌లో వెయ్యి పుస్తకాల ఆర్డర్ వచ్చింది. కొన్నదెవరో ఆచూకీ లేదు.

ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఆ వ్యాపారితో కలిసి జర్నలిస్ట్ ఒక పుస్తకంలో యాపిల్ ఎయిర్‌ట్యాగ్‌ను దాచాడు ఒక పుస్తకంలో AirTag దాచారు. ↓ కాలిఫోర్నియా నుంచి బయలుదేరింది. ↓ మిల్వాకీ చేరింది. ↓ కొలరాడో దాటింది. ↓ లాస్ వేగాస్ చేరింది. ↓ చివరకు LAS8 వద్ద ఆగిపోయింది. ↓ ఆ తర్వాత కనిపించిన పేరు: VGT3. ఆ గోడౌన్ ఉత్తర భాగంలో ఉన్న ఒక రహస్య స్థావరం పేరు 'VGT3'. అదొక అక్షరాల కబేళా. అక్కడికి వచ్చే ప్రతి పుస్తకం మరణశిక్ష పడ్డ ఖైదీలా బలిపీఠం ఎక్కుతుంది. ఆ గదిలో పనిచేసే కార్మికులు చెప్పిన నిజాలు వింటే రక్తం మరుగుతుంది. వేలాది ముద్రిత పుస్తకాలను తెచ్చి, బార్‌కోడ్‌లు, ఐఎస్బీఎన్ నంబర్లను యంత్రాలతో చదివిస్తారు. ఆ తర్వాత, పుస్తకానికి ప్రాణాధారమైన బైండింగ్‌ను క్రూరంగా కత్తిరిస్తారు. వెన్నెముక విరిగిన ఆ పేజీలను అతి వేగంగా పనిచేసే పారిశ్రామిక స్కానర్లలోకి తోసేస్తారు. ఆ అక్షరాల్లోని ప్రాణాన్ని డేటా రూపంలో పీల్చుకున్న తర్వాత, ఆ కాగితాలను అత్యంత హేయంగా చెత్తబుట్టలో విసిరేస్తారు. అదొక పైశాచిక ఆనందం. వాళ్ల టీమ్ లోగో చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది. ఒక డైనోసార్ తన భయంకరమైన దవడలతో ఒక పుస్తకాన్ని కొరికి తింటున్న దృశ్యం అందులో కనిపిస్తుంది. పుస్తకాన్ని పీక్కుతినే ఈ రాక్షస క్రీడను వాళ్లే గర్వంగా ప్రదర్శిస్తున్నారు. అయితే అమెజాన్ ఈ మారణహోమాన్ని సూటిగా అంగీకరించలేదు. వాణిజ్య మార్గాల ద్వారా పుస్తకాలను కొనుగోలు చేసి కస్టమర్ ఉత్పత్తులు, సేవలను మెరుగుపరచడానికి వాడుతున్నామని ఒక నిర్లిప్తమైన కార్పొరేట్ ప్రకటన విసిరింది. ఏఐ కోసం నాశనం చేస్తున్నామని ఎక్కడా చెప్పలేదు. అక్కడి గోడల మధ్య జరుగుతున్న వినాశనం మాత్రం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అసలు ఒక భౌతిక పుస్తకాన్ని ఎందుకు చంపాలి? ఈ ప్రశ్న అడిగితే టెక్నాలజీ ప్రపంచం చెప్పే సమాధానం విని నవ్వాలో ఏడ్వాలో అర్థం కాదు. ఇప్పుడు ఇంటర్నెట్ అంతా కృత్రిమ రాతలతో నిండిపోయి కల్తీ అయిపోయింది. ఎక్కడ చూసినా ఏఐ రాసిన వ్యాసాలు, ఏఐ సృష్టించిన అబద్ధాలు. ఒక ఏఐ మోడల్‌కు మళ్లీ అదే ఏఐ రాసిన వాక్యాలను చదివిస్తే దాని బుద్ధి మాంద్యం బారిన పడుతుంది. దాన్ని వాళ్లు 'మోడల్ కొలాప్స్' అంటారు. ఆ రోగం రాకుండా ఉండాలంటే వాళ్లకు స్వచ్ఛమైన మనిషి ఆలోచనలు కావాలి. అందుకే 2022కి ముందు అచ్చయిన పాత పుస్తకాల మీద వాళ్ల రాబందు కళ్లు పడ్డాయి. ఆ పుస్తకాల్లో ఏఐ రాసిన కల్తీ ఉండదు. అవి అచ్చమైన, స్వచ్ఛమైన మానవ మేధస్సుకు ప్రతీకలు. ఇంటర్నెట్‌లో దొరకని అరుదైన గ్రంథాలు, పాత చరిత్రలు, విభిన్న భాషల రచనలు వాళ్లకు ఇప్పుడు అమృతపు బిందువులు. వాటిని పీల్చుకోవడానికి ఏ దారుణానికైనా తెగించడానికి వాళ్లు సిద్ధమయ్యారు. పుస్తకాన్ని డిజిటలైజ్ చేయాలంటే దాన్ని అలాగే ఉంచి జాగ్రత్తగా స్కాన్ చేయొచ్చు. ఈ కార్పొరేట్ రాక్షసులకు అంత తీరిక లేదు, అంత ఓపికా లేదు. వాళ్లకు క్రూరమైన వేగం కావాలి. రోజూ లక్షల పేజీలను మింగేసే యాంత్రిక సామర్థ్యం కావాలి. అందుకే పుస్తకం వెన్నును కోసేసి విడి పేజీలను మెషిన్లలోకి పంపుతున్నారు. మనిషికి అదొక జ్ఞాపకం, వాళ్ల కళ్లకు అదొక ముడిసరుకు. చట్టం కూడా వీళ్లకు చుట్టంగానే మారింది. 2025లో ఆంత్రోపిక్ సంస్థపై వచ్చిన ఒక కేసులో అమెరికా కోర్టు ఒక విచిత్రమైన తీర్పు ఇచ్చింది. చట్టబద్ధంగా కొన్న పుస్తకాలను డిజిటలైజ్ చేసి శిక్షణకు వాడటం ఫెయిర్ యూజ్ కిందకే వస్తుందని చెప్పింది. పుస్తకాన్ని భౌతికంగా నాశనం చేయడం నైతికంగా సరైనదా కాదా అన్నది కోర్టు పట్టించుకోలేదు. చట్టబద్ధం కాబట్టి ఏమైనా చేయొచ్చు అన్న అహంకారంతో ఈ రాక్షస క్రీడ యథేచ్ఛగా సాగుతోంది. ఒకప్పుడు అమెజాన్ అంటే ఇంటింటికీ పుస్తకాలు పంచే అక్షర నిలయం అనుకున్నాం. విచిత్రం ఏమిటంటే, అదే సంస్థ ఇప్పుడు పుస్తకాలను ముక్కలు చేసే కబేళాగా మారింది. ఒక పుస్తకాన్ని మనం కొంటే అది చదువు, జ్ఞాపకం, సాంస్కృతిక వారసత్వం. అదే పుస్తకాన్ని ఈ ఏఐ కంపెనీలు కొంటే అది డేటా, శిక్షణ సామర్థ్యం. ఒకే వస్తువుకు రెండు వేర్వేరు విలువలు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, రెండో విలువ మొదటి విలువను పూర్తిగా చంపేస్తోంది. డిజిటల్ కాపీ భౌతిక పుస్తకాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేదు. డిజిటల్ ఫైల్‌కు అక్షరాలు మాత్రమే తెలుసు. భౌతిక పుస్తకానికి ఒక ఆత్మ ఉంటుంది. అది చేతులు మారిన చరిత్ర ఉంటుంది. ఆ అట్ట మీది బొమ్మ ఒక కళాఖండం. లోపలి పాత లేఖ ఒక జీవితం. ఇవన్నీ డిజిటల్ అగాధంలో శాశ్వతంగా కనుమరుగైపోతున్నాయి. ఇందులో దాగి ఉన్న అతి పెద్ద ప్రమాదం మరోటి ఉంది. ఒక అరుదైన పుస్తకానికి ఒకే ఒక్క భౌతిక కాపీ ఉందనుకోండి. దాన్ని ఈ ఏఐ సంస్థలు కొనేసి, స్కాన్ చేసి, ఆ అసలు పుస్తకాన్ని మంటల్లో కలిపితే పరిస్థితి ఏంటి? ఆ జ్ఞానం అంతా ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లోకి వెళుతుంది. రేపు ఒక పరిశోధకుడికి ఆ పుస్తకం కావాలంటే దొరకదు. గ్రంథాలయాల్లో దాని ఆనవాళ్లు ఉండవు. ప్రజా ప్రపంచంలో స్వేచ్ఛగా తిరగాల్సిన జ్ఞానం ఒక ప్రైవేట్ సాంకేతిక వ్యవస్థలో బందీ అవుతుంది. ఇది జ్ఞానాన్ని డిజిటలైజ్ చేయడం కాదు, జ్ఞానానికి ప్రైవేట్ గేట్లు కట్టి తాళం వేయడం. కృత్రిమ మేధస్సుకు మనిషి జ్ఞానం అవసరం అన్నది వాస్తవం. ఏఐకి మంచి డేటా ఇవ్వొచ్చు. దాన్ని వ్యతిరేకించడం లేదు. దానికి ఇంత కిరాతకమైన మార్గమే ఎందుకు ఎంచుకోవాలి? పుస్తకాలను కత్తిరించకుండా స్కాన్ చేసే సాంకేతికతను వాడొచ్చు. గ్రంథాలయాలు, ప్రచురణ సంస్థలతో కలిసి పని చేయొచ్చు. డిజిటల్ కాపీ వచ్చిన తర్వాత అసలు పుస్తకాన్ని అపురూపంగా కాపాడుకోవచ్చు. దానికి కావాల్సింది కొంచెం సమయం, కాస్తంత మనసు. లాభాల వేటలో, డేటా ఆకలితో రగిలిపోయే ఈ కార్పొరేట్ సంస్థలకు ఆ ఆర్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి శతాబ్దాల పాటు జ్ఞానాన్ని సేకరించాడు. రాతి పలకల నుంచి కాగితం దాకా ఆ ప్రయాణం సాగింది. గ్రంథాలయాలను నిర్మించి తరతరాలకు ఆ జ్ఞానాన్ని అందించాడు. రేపు భవిష్యత్తులో ఒక చరిత్రకారుడు మన కాలాన్ని చూస్తే ఏమనుకుంటాడు? వీళ్లు జ్ఞానాన్ని కాపాడారా లేక జ్ఞానంపై ఆధిపత్యాన్ని మార్చారా అని నిలదీస్తాడు. మనిషి తన జ్ఞాపకాలను యంత్రాలకు ఇచ్చేటప్పుడు, వాటి అసలు రూపాలను ఎందుకు ముక్కలు చేశాడు అని సూటిగా ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నలకు ఏ కృత్రిమ మేధస్సూ సమాధానం చెప్పలేదు. ఒక నాగరికత తన భవిష్యత్తును నిర్మించుకునే తొందరలో తన గతాన్ని తానే నాశనం చేసుకుంటే, అంతకంటే విషాదం మరొకటి ఉండదు. అక్షరాలు డిజిటల్ తెరల మీద బతికే ఉండొచ్చు. ఆ అక్షరాలను మోసిన కాగితం మాయమైపోతుంది. ఆ కాగితంతో పాటు మనిషిలోని ఒక భాగం కూడా అంతరిస్తుంది. రేపటి కృత్రిమ యుగానికి పునాదులు వేయడానికి, నేటి భౌతిక సత్యాలను బలిపీఠం ఎక్కిస్తున్న ఈ క్రూరమైన ఆటలో మనం కోల్పోతున్నది పేజీలను కాదు... పదిలమైన మన ఆత్మను. ఒక చిన్న మనవి... మీ ఇళ్లలో, పాత అల్మారాల్లో పదిలంగా ఉన్న పాత పుస్తకాలను కాపాడుకోండి. ఆ పసుపు పచ్చని కాగితాల్లో మన మునుపటి తరాల జ్ఞాపకాలు, ఎప్పటికీ చెరగని అపురూపమైన వారసత్వం దాగి ఉన్నాయి. దయచేసి ఆ పుస్తకాలను గుడ్డిగా అమ్మేయకండి. తెలియని వ్యక్తులకు, ఆన్‌లైన్ వ్యాపారులకు అప్పగించకండి. ఎందుకంటే, రేపు ఆ పుస్తకాలు ఏ యంత్రానికో ఆహారంగా మారి, నిర్దాక్షిణ్యంగా ముక్కలై చెత్తబుట్టలో పడొచ్చు. మనకు ప్రాణసమానమైన ఆ అక్షరాలకు ఆ దుస్థితి పట్టనివ్వద్దు. అక్షరాలను ప్రేమించే ప్రతి ఒక్కరికీ నాదొక వినయపూర్వకమైన అభ్యర్థన. మన భౌతిక జ్ఞాన సంపదను రేపటి తరాల కోసం సజీవంగా బతికించుకుందాం. దయచేసి ఈ నిజాన్ని మీ మిత్రులకు, తోటి పుస్తక ప్రేమికులకు చేరేలా ఈ అంశాన్ని పంచుకోండి. ఇది నా వ్యక్తిగత విన్నపం కాదు, ప్రాణం ఉన్న మన పుస్తకాలను మనం రక్షించుకోవడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. పాత పుస్తకాలను కాపాడుకుందాం... మన అక్షరాల ఆత్మను బతికించుకుందాం!